తెలంగాణా రాష్ట్ర మంత్రివర్గం శనివారం అత్యవసరంగా సమావేశం కానున్నది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి తదితర అంశాలపై కేబినెట్ ఈ సందర్భంగా చర్చించనున్నది.

Comments are closed.

Exit mobile version