Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»Crime News»తనపై తానే కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ

    తనపై తానే కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ

    September 28, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 police

    ఓ ఎస్ఐ తనపై తానే కేసు నమోదు చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భూవివాదానికి సంబంధించి రెవెన్యూ అధికారులతోపాటు ఫిర్యాదులో తన పేరు కూడా ఉండడంతో ఆయన ఈ కేసు నమోదు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెడితే…

    సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడ మల్కాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 43లో 12.00 ఎకరాల భూమికి సంబంధించి రెండు వర్గాలు వివాదానికి దిగాయి. ఆయా భూమి తమదంటే తమదని, భూములకు హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు.

    అయితే ఈ అంశాన్ని అధికారులు తేల్చకపోవడంతో గుడమల్కాపురానికి చెందిన రమా ప్రభాకర్ కోదాడ కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఫిర్యాదులో పేర్కొన్నవారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

    ఆయా పరిణామాల్లో హుజూర్ నగర్ ఆర్డీవో వెంకటారెడ్డి, తహశీల్దార్ కృష్ణమోహన్, ఇతర రెవెన్యూ సిబ్బంది సహా మొత్తం 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఫిర్యాదులో పేర్కొన్న 17 మందిలో చింతలపాలెం ఎస్ఐ రంజిత్ రెడ్డి పేరు కూడా ఉండడంతో అనివార్యంగా ఆయన తనపై తానే కేసు నమోదు చేసుకోవలసి వచ్చింది.

    chintalapalem SI Ranjith Reddy suryapet police ఎస్ఐ రంజిత్ రెడ్డి సూర్యాపేట పోలీస్
    Previous ArticleBreaking: మరిపెడలో దారుణం
    Next Article ‘కుమ్ముక్కు’ పోలీసులపై సీజేఐ కీలక వ్యాఖ్యలు

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.