ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణా ప్రభుత్వం మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ఈనెల 30వ తేదీ నుంచే రిటైర్మెంట్ వయస్సు పెంపు అమల్లోకి వస్తుందని గెజిట్ లో పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెలలో పదవీ విరమణ చేయాల్సిన సుమారు 563 మంది ఉద్యోగులకు, 430 మంది టీచర్లకు మరో మూడేళ్ల పదవీ కాలం కలిసొచ్చిందంటున్నారు.

Comments are closed.

Exit mobile version