తెలంగాణాలో సినిమాల ప్రదర్శనకు అనుమతినిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. కోవిడ్-19 మార్గదర్శకాల ప్రకారం థియేటర్ల, మల్టీప్లెక్సుల రీ-ఓపెనింగ్ కు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన మార్గదర్శకాలను, ప్రేక్షకుల భద్రతకు పాటించాల్సిన పద్ధతులను కూడా ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు.
![ts29 movie](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/11/movie.jpg?resize=562%2C916&ssl=1)