Facebook X (Twitter) YouTube
    Saturday, September 30
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»అధికారులపై ‘పొంగులేటి’ ఘాటు విమర్శలు

    అధికారులపై ‘పొంగులేటి’ ఘాటు విమర్శలు

    July 1, 20232 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 psr poster

    ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు అధికారులపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అధికారుల వైఖరిగా ప్రస్తావిస్తూ ఆయన తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. ఈమేరకు శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. లక్షలాది మంది గుండె చప్పుడైన కాంగ్రెస్ పార్టీలో తన అభిమానుల కోరిక మేరకు చేరుతుంటే అది జీర్ణించుకోలేని రాక్షస బీఆర్ఎస్ ప్రభుత్వం రకరకాల కుయుక్తులు పన్నుతూ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. అధికారులు కూడా బీఆర్ఎస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ, వారి అండదండలతో తమకున్న అధికారంతో రకరకాలుగా తనను, తన అనుచరులను ఇబ్బందులు పెట్టే కుట్రలు చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ సభ కోసం జనాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు కావాలని కోరితే ప్రజాప్రతినిధులకు దాసోహమై బస్సుల కేటాయింపునకు అధికారులు అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీపై తనపై ఉన్న అభిమానంతో తరలిరావాలని కోరారు. స్వచ్ఛందంగా జీపులు, డీసీఎంలు ఇతరత్రా రవాణా సౌకర్యాల ద్వారా రావడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే పిరికిపందల్లా చెక్ పోస్టుల దగ్గర వాహనాలను ఆపేందుకు ఆదేశాలు ఇచ్చారన్నారు.

    ts29 జనగర్జన

    తన అనుచరుడు మువ్వా విజయబాబును చంపుతామని బెదరిస్తు పోస్టర్లు రిలీజ్ చేయడం కాదని, దమ్ముంటే నేరుగా వచ్చి తనను, తన అనుచరులను ఢీకొనాలని సవాల్ విసిరారు. తనను అణగదొక్కడం చేతకాక తన అనుచరులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘ఒకటి చెబుతున్నా రాసిపెట్టుకోండి వెంట్రుకలు కూడా పీకలేరు. ప్లెక్సీలు చింపించడం, సభకు వెళ్తారనే దురుద్ధేశంతో మంచినీటి సరఫరా నిలిపి వేసి వారిని రోజంతా తీవ్ర ఇబ్బందులు గురి చేశారు’ అని అన్నారు.

    కాగా ‘ఐఏఎస్ స్థాయిలో ఉన్న మున్సిపల్ అధికారి పార్టీ తొత్తులాగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? మరో పక్క పోస్టర్ రిలీజ్ చేసి తన అనుచరుణ్ణి చంపుతామని బెదిరించినట్లు సాక్ష్యంతో సహా చూపిస్తే ఐపీఎస్ స్థాయిలో ఉన్న జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఎటువంటి సమగ్ర విచారణ చేపట్టకుండానే అటువంటిదేమి లేదని అధికార పార్టీ వారు రాసిచ్చిన స్క్రిప్టును మీడియా ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఫిర్యాదు తీసుకొనేందుకు వెనుకాడుతూ, ఎలాంటి ఫిర్యాదు చేయలేదనడం సరికాదన్నారు. కావాలని అధికారులు ఫిర్యాదును తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఇటువంటి ప్రకటన చేయడం హాస్యస్పాదమన్నారు. ఇకనైనా ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి వాల్ పోస్టర్ తయారు చేసి అతికించే ప్రయత్నం చేసిన వారిని గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    Khammam congress meeting Khammam News khammam politics muvva vijay babu Ponguleti Srinivasareddy telangana jana garjana sabha
    Previous Article‘పోస్టర్ బెదిరింపు’లపై ఖమ్మం సీపీ కీలక ప్రకటన
    Next Article రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    Related Posts

    ‘తుమ్మల’ భూములపై భూతద్దం..!?

    September 1, 2023

    ‘పోస్టర్ బెదిరింపు’లపై ఖమ్మం సీపీ కీలక ప్రకటన

    July 1, 2023

    ‘పొంగులేటి’ లీగల్ నోటీస్

    June 30, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.