పెద్దపల్లి ఆర్డీవో అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఆర్డీవో శంకర్ కుమార్ ఓ కాంట్రాక్టర్ నుంచి మధ్యవర్తి ద్వారా రూ. లక్ష లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జి కమిషనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ లో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న రజినీకాంత్ పట్టణ ప్రగతి హైడ్రోక్లోరైడ్ ద్రావణానికి సంబంధించిన బిల్లు రావాల్సి ఉండగా, దాదాపు 9 లక్షల 25 వేల బిల్లుకు సంబంధించి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు.

ఈ నేపథ్యంలోనే మధ్యవర్తి ద్వారా దాదాపు లక్ష రూపాయల మొత్తాన్ని ఆర్డీవో శంకర్ కుమార్ కాంట్రాక్టర్ నుంచి లంచంగా అడిగినట్లు సమాచారం. దీంతో కాంట్రాక్టర్ రజినీకాంత్ ఏసీబీని ఆశ్రయించి మధ్యవర్తికి లక్ష రూపాయలు ఇస్తుండగా పట్టుకున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.

Comments are closed.

Exit mobile version