తమ చెరలో గల సీఆర్పీఎఫ్ జవాన్ రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టు నక్సలైట్లు విడుదల చేశారు. ఈనెల 3వ తేదీన బీజాపూర్ జిల్లా జీరగూడెం-తొర్రెం అడవుల్లో జరిగిన భీకర ఎన్కౌంటర్ ఘటన సందర్భంగా రాకేశ్వర్ సింగ్ ను నక్సలైట్ల బందీగా చిక్కిన సంగతి తెలిసిందే. గడచిన అయిదు రోజులుగా నక్సల్స్ చెరలో గల రాకేశ్వర్ సింగ్ ను ఎన్కౌంటర్ జరిగిన తొర్రెం గ్రామ సమీపాన్నే కొద్దిసేపటి క్రితం విడుదల చేసినట్లు సమాచారం. జీరగూడెం-తొర్రెం గ్రామస్తులకు రాకేష్ ను అప్పగించి నక్సలైట్లు అతన్ని విడుదల చేసినట్లు సమాచారం.
![ts29 rakesh](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2021/04/rakesh.jpg?resize=788%2C465&ssl=1)