మావోయిస్టు నక్సలైట్లు పేల్చిన మందుపాతర ఘటనలో ఇద్దరు పోలీసులు మరణించారు. బస్తర్ లోని అబూజ్ మడ్ ప్రాంతంలో జరిగిన ఈఘటనలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని రెండు వేర్వేరు చోట్ల నక్సలైట్లు మందుపాతర పేల్చారు. ఈ ఘటనల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, అదే ప్రాంతంలోని కాకూర్ అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఈ ఉదంతంలో ఓ పోలీసు గాయపడినట్లు వార్తలు అందాయి. గాయపడిన జవాన్ ను రాయ్ పూర్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కాగా ఆయా సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.