శీర్షికలోని పదాల్లో డబుల్ మీనింగ్ ధ్వినిస్తున్నట్లుందా? ఔననే ప్రచారం జరుగుతోంది. అయితే సాక్షాత్తూ రాష్ట్ర కేబినెట్ మంత్రి ఒకరు చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళా అధికారిని ఉటంకిస్తూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యల వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెడితే… వరంగల్ అర్బన్ జిల్లా, హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం ఉప్పల్ లో శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో మంత్రి ఎర్రబెల్లి మహిళా అధికారిని ఉద్ధేశిస్తూ చేసిన ఆయా వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

‘ఎంపీడీవో గారూ..? ఉన్నడానయా…?? అని మంత్రి ప్రశ్నించగా, మేడం.. మేడం అంటూ పక్కనే గల వారు మహిళా అధికారిగా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ మంత్రి ఎర్రబెల్లి ‘మేడం… నువ్వయితే బాగనే ఊపుతానవ్ గానీ, ఈడ ఊపుతలేవ్? అని వ్యాఖ్యానించడంతో సభికుల్లో కొందరు కిలకిలా నవ్వడం గమనార్హం. ఆ తర్వాత కొద్ది క్షణాల తేడాతో మంత్రి మాట్లాడుతూ, బాగానే పన్జేస్తది లెండి… నీయన్నీ వర్కులు మంచిగ తయార్ జెయ్యాలె… వైకుంఠథామం ఎట్లున్నది? నేన్ బొయెటపుడు జూస్త ఇపుడు… బాగున్నదా?’ అంటూ మంత్రి ముగించిన వ్యాఖ్యల వీడియో తీవ్ర దుమారం కలిగిస్తోంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను దిగువన చూసేయండి.

Comments are closed.

Exit mobile version