Facebook Twitter YouTube
    Monday, May 29
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»హరిభూషణ్ మృతిపై మావోయిస్టు పార్టీ క్లారిటీ

    హరిభూషణ్ మృతిపై మావోయిస్టు పార్టీ క్లారిటీ

    June 24, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 haribhushan

    మావోయిస్టు పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ మృతి చెందారనే వార్తలపై ఆ పార్టీ క్లారిటీ ఇచ్చింది. హరిభూషణ్ తోపాటు మరో నాయకురాలు భారతక్క అలియాస్ సారక్క కూడా మరణించినట్లు మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఆ పార్టీ తెలంగాణా కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. కరోనా లక్షణాలతోనే వీరిద్దరూ అనారోగ్యానికి గురై మరణించినట్లు పార్టీ వెల్లడించింది.

    ఈనెల 21న హరిభూషణ్, 22న పార్టీ ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సారక్క తుదిశ్వాస విడిచారని జగన్ పేర్కొన్నారు. యాప నారాయణ చాలాకాలంగా బ్లాంకైటీస్, అస్తమా వ్యాధులతో బాధపడుతున్నారని కూడా చెప్పారు. ప్రజల మధ్యనే వీరిద్దరి అంత్యక్రియలు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా అటు హరిభూషణ్, ఇటు భారతక్క పార్టీకి చేసిన సేవలను జగన్ కొనియాడారు ఆయన విడుదల చేసిన ప్రకటన తొలిపేజీలోని సారాంశం దిగువన చూడవచ్చు.

    ts29 haribhushan
    corona died haribhushan maoist party naxal leader jagan
    Previous Articleమీనగట్ట ‘మిస్టరీ’!
    Next Article ‘మావో’ల మానవ హక్కుల ఉల్లంఘన

    Related Posts

    మావోయిస్టు అగ్ర నేత మృతి!

    October 14, 2021

    నక్సల్ అగ్ర నేత లొంగుబాటు

    September 17, 2021

    ‘మావో’లతో మాజీ అగ్ర నేత ఢీ!

    July 11, 2021

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.