Facebook X (Twitter) YouTube
    Sunday, September 24
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»Political News»చేతగాక నేతల ‘సహజీవనం’… సాగర్ జీ వ్యాఖ్యల కలకలం!

    చేతగాక నేతల ‘సహజీవనం’… సాగర్ జీ వ్యాఖ్యల కలకలం!

    May 19, 20202 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 cv

    కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను చేతగానితనంగా బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు (సాగర్ జీ) అభివర్ణించారు. సాగర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణాలో రాజకీయ కలకలానికి కారణమయ్యాయి. ‘కరోనాతో కలిసి జీవించడం నేర్చుకుని, ప్రజలు తమ బతుకును కొనసాగించాలి’ అని తెలంగాణా సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలోనూ తాజాగా పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే తన వ్యాఖ్యల్లో విద్యాసాగర్ రావు కేసీఆర్ పేరును ఎక్కడా ఉటంకించకపోవడం గమనార్హం.

    ‘అసలు కరోనాతో సహజీవనం చేయడమేంటి? చేతగాక కొందరు కరోనాతో సహజీనవం చేద్దామంటున్నారు’ అని ఆయన అన్నారు. మంగళవారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ, కరోనాతో కలిసి సహజీవనం చేయాలని కొందరు మాట్లాడుతున్నారని, అది సరైంది కాదన్నారు. కరోనాను నియంత్రించాలే తప్ప, కలిసి జీవించడమేంటి? అని ప్రశ్నించారు. తేలు మంత్రం వచ్చినోడు పాము నోట్లో వేలు పెట్టినట్లు కొంతమంది వ్యవహరిస్తున్నారని, కొందరు చేతగాక సహజీవనం చేద్దామంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కరోనాతో సహజీవనం చేయాలంటున్న నేతల తీరును ఆయన తప్పుపట్టారు. ఈ కరోనాను టీవీల్లో రంగు రంగుల్లో చూపిస్తున్నారని, దాన్ని అంత గొప్పగా చూపించడం ఆపాలని విద్యాసాగర్ రావు కోరారు.

    కరోనా చాలా ప్రమాదకరం, దాన్ని నియంత్రించేందుకు దేశంలోని లక్షలాది గ్రామాలు కృషి చేశాయని విద్యాసాగర్ రావు అన్నారు. పంచాయితీ వ్యవస్థ ఎంత గొప్పదో దీనివల్లే అర్థమైందని, కవి సి. నారాయణరెడ్డి స్ఫూర్తితో కరోనా కట్టడికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘మరణం నన్ను వరించి వస్తే పాలుపట్టి జోలపాట పాడి పడుకోబెడ్తాను’ అని సినారె అన్నారని, ఇప్పుడు మనం చేస్తున్నది అదేనని, దాన్ని కంటిన్యూ చేయాలన్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కావొద్దన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ కరోనాకు చిక్కకుండా ప్రాణాలు దక్కించుకోవాలన్నారు.

    ts29 IMG 20200519 WA0006
    మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు, పక్కన బండి సంజయ్ కూడా ఉన్నారు.

    బండి సంజయ్ పై ప్రశంసల వర్షం:
    కాగా బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ పనితీరుపై విద్యాసాగర్ రావు ఈ సందర్భంగా ప్రశంసల వర్షం కురిపించారు. సంజయ్ సేవలను గుర్తించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆయనను పార్టీ నియమించడం హర్షణీయమన్నారు. సంజయ్ నాయకత్వంలో పార్టీ బలోపేతమవుతుందన్న నమ్మకం తనకుందన్నారు. రాష్ట్ర భారతీయ జనాతా పార్టీని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మంచి స్థానంలో నిలిపే సత్తా సంజయ్ కి ఉందన్నారు. కరీంనగర్ జిల్లాకు చాలా రోజుల తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కిందని, గతంలో తాను కూడా రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశానని గుర్తు చేశారు.

    తాను రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు 12 మంది ఎమ్మెల్యే, ఏడు ఎంపీ స్థానాల్లో గెలిచామన్నారు. బీజేపీ చరిత్రలో రాష్ట్రంలో ఇప్పటి వరకు అవే అత్యధిక స్థానాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తమను బ్రేక్ ఫాస్ట్ కు పిలిచి వాజ్ పేయి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని ఉత్తరం అందించినట్లు విద్యాసాగర్ రావు చెప్పారు. ఆతర్వాత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. అప్పట్లో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం ఏర్పడటంలో కరీంనగర్ జిల్లా నాయకత్వం కీలక పాత్ర పోషించిందని, ఇప్పుడు కూడా సంజయ్ నేతృత్వంలో బీజేపీ రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించబోతోందనే నమ్మకం తనకుందని విద్యాసాగర్ రావు ధీమా వ్యక్తం చేశారు.

    Previous Articleనా మాత గోమాతే… ‘తల్లి’డిల్లిన చిరుత… కానీ జరిగిందేమిటో తెలుసా?
    Next Article ‘కేసీఆర్’తో ఇక యుద్ధమేనా!

    Related Posts

    ‘తుమ్మల’ భూములపై భూతద్దం..!?

    September 1, 2023

    రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    July 13, 2023

    అధికారులపై ‘పొంగులేటి’ ఘాటు విమర్శలు

    July 1, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.