తెలంగాణ గవర్నర్ కు భద్రాచలంలో చేదు అనుభవం ఎదురైంది. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి రైలు ప్రయాణం ద్వారా భద్రాచలానికి చేరుకున్న గవర్నర్ తమిళి సైకి మళ్లీ అవమానం జరిగినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. సోమవారం గవర్నర్ భద్రాచలం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్ లు గైర్హాజరయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చకు దారి తీసింది.

రాష్ట్ర గవర్నర్ తమిళి సై, అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం. ప్రొటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ గవర్నర్ పర్యటనలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, వారిద్దరూ గైర్హాజరు కావడం ప్రకంపనలు రేపుతోంది. అంతేకాదు… భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కూడా గవర్నర్ పర్యటనలో పాల్గొనకపోవడం గమనార్హం.

భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేక ఘట్టం

Comments are closed.

Exit mobile version