ఔను… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో దుశ్శాసన వారసులు బయటపడ్డారు. ఇది ఎవరో చేస్తున్న ఆరోపణ కాదు. సాక్షాత్తూ ఆ పార్టీకి చెందిన కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మి తనకు జరిగిన దుశ్శాసన పర్వపు పరాభవం దృశ్యానికి సంబంధించిన ఘటనను స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు వివరిస్తూ భోరున విలపించారు.

వరిధాన్యం కొనుగోలు అంశంపై కొత్తగూడెంలో శుక్రవారం నిర్వహించిన ఆందోళనా కార్యక్రమం సందర్భంగా తనకు ఈ పరాభవం జరిగినట్లు ఆమె విలపిస్తూ చెప్పారు. బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగా కొందరు మున్సిపల్ కౌన్సిలర్ల భర్తలు తనతో ఆకతాయిల్లాగా ప్రవర్తించారని, వెనుక నుంచి బైకులతో ఢీకొట్టి తన చీర కుచ్చిళ్లు జారిపోయేలా వ్యవహరించారని ఆమె దుఃఖించారు.

తాను దండం పెడుతూ అభ్యర్థించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ సీతామహాలక్ష్మి ఈ ఘటనపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు సమక్షంలో ఏమంటున్నరాో దిగువన గల వీడియలో చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version