నల్లగొండ జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు రూపొందించిన షీ టీమ్ పాటను మంత్రి జగదీష్ రెడ్డి, డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. జిల్లాకు చెందిన పోలీసు అధికారులు బి. సురేష్ కుమార్, ఎస్.ఎం. బాషా, ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నరేష్, రేవతి తదితరులు నటించగా, చరణ్ అర్జున్ సంగీత దర్శకత్వంలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ సమర్పణలో షీ టీమ్ పాటను రూపొందించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి, డీజీపీ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీడియో సాంగ్ ను వీక్షించి అభినందించారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా జడ్జి రమేష్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డీఐజీ రంగనాధ్, ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, డీఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రమణా రెడ్డి, రవీందర్, సురేష్ కుమార్, అటవీ అధికారి రాంబాబు, మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఆర్క్ గ్రూప్ చైర్మన్ గుమ్మి రాంరెడ్డి, టర్మీనస్ గ్రూప్ సిఎండి ఎస్.పి. రెడ్డిలతో పాటు పలువురు సీఐలు, ఆర్.ఐ.లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

నల్లగొండ పోలీసులు చేసిన ఓ వినూత్న ప్రయత్నానికి సంబంధించిన ఈ పాటను దిగువన గల వీడియో లింక్ ద్వారా వీక్షించవచ్చు.

Comments are closed.

Exit mobile version