ఖమ్మం నగరంలోని ముత్యాలమ్మ గుడి సెంటర్ లోని జంక్షన్ లో నిర్మిస్తున్న ఓ మత విగ్రహంపై తెలంగాణా హైకోర్టు కీలక ఉత్తర్వు జారీ చేసింది. విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి అల్లిక అంజయ్య దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈమేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
![ts29 bbf2](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2021/12/bbf2.jpeg?resize=571%2C808&ssl=1)
వచ్చే మార్చి 14వ తేదీ వరకు ఎటువంటి విగ్రహం పనులను అక్కడ నిర్వహించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాల ప్రకారం ఈ ఉత్తర్వును ఇస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఖమ్మం జిల్లా కలెక్టర్ ను, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది.
హైకోర్టు జారీ చేసి ఉత్తర్వు ప్రతిని దిగువన చూడవచ్చు.
![ts29 hc](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2021/12/hc.jpeg?resize=576%2C1024&ssl=1)
![ts29 hc2](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2021/12/hc2.jpeg?resize=540%2C960&ssl=1)