నక్సలైట్ల కోసం కూబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా తుపాకీ మిస్ ఫైర్ కావడంతో రిజర్వుడ్ విభాగానికి చెందిన ఎస్ఐ ఒకరు దుర్మరణం చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టు నక్సల్స్ ఏరివేతలో భాగంగా పోలీసులు కూబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్ఎస్ఐ ఆదిత్య చేతిలోని ఆయుధం ప్రమాదవశాత్తూ మిస్ ఫైర్ కావడంతో అతను చనిపోయినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ప్రకటించారు.