ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు వినూత్న తరహాలో తన అభిమానాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవితకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడు ఓ అభిమాని.

నిజామాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయి ప్రసాద్ కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పారాగ్లైడింగ్ ద్వారా భారీ ఫ్లెక్సీతో కవితకు శుభాకాంక్షలు తెలిపారు. నలభై ఫీట్ల పొడవు గల ఈ భారీ శుభాకాంక్షల ఫ్లెక్సీ ఆకాశంలో ఎగరగా స్థానికులు ఆసక్తిగా తిలకించడం విశేషం.

Comments are closed.

Exit mobile version