నిజామాబాద్ లో మంగళవారం అర్థారాత్రి దాటాక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతికి మద్యం తాగించి నలుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని గమనించిన సెక్యూరిటీ గార్డులు డయల్ 100కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. చికిత్స కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments are closed.

Exit mobile version