ఇండియన్ రైల్వే శాఖ ప్రస్థానంలో మరో మైలురాయి ఫలితమిది. డబుల్ డెక్కర్ రైళ్ల గురించి తెలిసిందే. అదే తరహాలో సరుకు రవాణా చేేసే ‘డబుల్ స్టాక్ కంటెయినర్ ట్రెయిన్’ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా?… ఇదిగో ఇలా ఉంటుంది. సరుకు రవాణాలో సరికొత్త రికార్డుకు శ్రీకారం చుడుతూ ఇండియన్ రైల్వే శాఖ డబుల్ స్టాక్ కంటెయినర్ ట్రెయిన్ ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించింది.
వెస్ట్రర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లో ఈ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. ఈమేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం సరుకు రవాణాలో తన విధానాన్ని మారుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. డబుల్ స్టాక్ కంటెయినర్ ట్రెయిన్ ట్రయల్ రన్ దృశ్యాన్ని దిగువన మీరూ చూసేయండి.