మంత్రి ఈటెల రాజేందర్ ను తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. సీఎం కేసీఆర్ సిఫారసు మేరకు రాష్ట్ర మంత్రివర్గం నుంచి గవర్నర్ ఈటెల రాజేందర్ ను తొలగించారని, వెంటనే ఇది అమల్లోకి వస్తుందని అధికారిక ప్రకటన వెలువడింది. భూకబ్జాల ఆరోపణలు ఎదుర్కుంటున్న రాజేందర్ నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్యశాఖను నిన్న సీఎం కేసీఆర్ కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే మంత్రివర్గం నుంచి ఈటెలను బర్తరఫ్ చేయడం గమనార్హం.
![ts29 etela 5](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2021/05/etela-5.jpg?resize=788%2C639&ssl=1)