విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లోఆరుగురు నక్సలైట్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందిన సందె గంగయ్య అనే డీసీఎం కేడర్ నక్సల్ నాయకుడు కూడా ఉన్నట్లువార్తలు వస్తున్నాయి. సందె గంగయ్య ఒకప్పటి పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణా సోషల్ జోన్ కమిటీ కార్యదర్శిసందె రాజమౌళి అలియాస్ ప్రసాద్ సొదరునిగా తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్మండలం గుంపుల గ్రామానికి చెందిన సందె రాజమౌళి ఎన్కౌంటర్ లో మరణించారు. ఆయన పెద నాన్నకుమారుడే గంగయ్యగా తెలుస్తోంది. గంగయ్య సోదరుడు ఒకరు కూడా పీపుల్స్ వార్ లో పని చేసి ఎన్కౌంటర్లోనే చనిపోయినట్లు సమాచారం.
![ts29 naxal](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2021/06/naxal-.jpg?resize=290%2C643&ssl=1)
ఫొటోలు: ఎన్కౌంటర్ ఘటనా స్థలిలో స్వాధీన చేసుకున్న సామాగ్రి, మృతి చెందిన నక్సల్