టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వర్ రావు హైదరాబాద్ నివాసంలో, ఆయనకు చెందిన పలు కంపెనీల ఆఫీసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహిస్తున్నారు. నామ నాగేశ్వర్ రావుకు చెందిన మధుకాన్ గ్రూప్ సంస్థలు సహా మొత్తం అయిదు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టు నిర్మాణపు పనుల కోసం తీసుకున్న రుణాలకు సంబంధించిన లావాదేవీలపై ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం వరకు సోదాలు జరిగే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Comments are closed.

Exit mobile version