దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంది. ఈమేరకు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ కు చెందిన ముగ్గురిపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చర్యలు తీసుకున్నారు. మరియమ్మ మృతికి బాధ్యులనే అభియోగంపై ఎస్సై మహేశ్వర్‌, కానిస్టేబుళ్లు రషీద్ పటేల్, జానయ్యలను సర్వీసు నుంచి తొలగించారు.

ఆర్టికల్ 311 (2) బి 25 (2) ప్రకారం బాధ్యులపై అదనపు డీజీ హోదాలో గల రాచకొండ సీపీ ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు సస్పెన్షన్ లో గల ఆయా ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను తాజాగా ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడేనికి చెందిన మరియమ్మ లాకప్ డెత్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.

Comments are closed.

Exit mobile version