ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్లు చోరీకి గురయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తి వీటిని దొంగిలించినట్లు అధికారులు గుర్తించారు. బెమెతారా జిల్లాలోని నవఘర్ లో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోకి ప్రవేశించి 90 డోసుల వ్యాక్సిన్లను ఎత్తుకువెళ్లినట్లు కనుగొన్నారు. ఈ ఘటన అధికార వర్గాల్లో తీవ్ర కలకలానికి దారి తీసింది. ఇక్కడి కమ్యూనిటీ సెంటర్ లో వృద్ధులకు, రెండో దశ టీకాలను ఇస్తున్నారు. వైద్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వ్యాక్సిన్లు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Comments are closed.

Exit mobile version