తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారి నుంచి కోలుకున్నట్లుగానే తెలుస్తున్నది. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎం.వి. రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం బుధవారం ఆయనకు పరీక్షలు నిర్వహించింది. తన వ్యవసాయ క్షేత్రంలో ఐసొలేషన్ లో గల సీఎంకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ టెస్టులో నెగటివ్ గా రిపోర్టు రాగా, ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు గురువారం రానున్నాయి.