తెలంగాణా ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్ రావు కరోనా బారిన పడ్డారు. స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, గత కొద్ది రోజులుగా తనతో కాంటాక్టులో గల వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కూడా ఆయన కోరారు. తనకు కరోనా సోకిన విషయాన్ని హరీష్ రావు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.