Close Menu
    Facebook X (Twitter) YouTube
    Wednesday, November 29
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»‘న్యూస్ ఛానల్’ను కమ్మేసిన కరోనా!

    ‘న్యూస్ ఛానల్’ను కమ్మేసిన కరోనా!

    July 3, 20201 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 corona 1

    మీడియా ప్రతినిధులను కరోనా చుట్టుముట్టడం కొత్త వార్త కాకపోవచ్చు. ఓ ఛానల్ కు చెందిన జర్నలిస్టు ఒకరు ఇప్పటికే మృత్యువాత పడగా, అనేక మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. మరికొందరు కోలుకున్నారు కూడా. కానీ తెలుగు మీడియాలోని ఓ ప్రముఖ ఛానల్ ను కరోనా చుట్టుముట్టడమే తాజా వార్త. దీంతో ఆయా సంస్థలకు చెందిన ఉద్యోగులు కలవరపడుతున్నారు.

    ఆయా ఛానల్ లో అత్యున్నత స్థాయిలో పనిచేసే ఓ జర్నలిస్టు కమ్ యాంకర్ గడచిన రెండు, మూడు రోజులుగా ఎటువంటి డిబేట్లు నిర్వహించడం లేదు. ఆయన స్థానంలో మరో జర్నలిస్టు డిబేట్ ను నెట్టుకొస్తున్నారు. ఇదే ఛానల్ లో పనిచేసే కొందరు ఔట్ పుట్ ఎడిటర్ స్థాయి ఉద్యోగులకు కూడా కరోనా సోకినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఛానల్లో పనిచేసే ఆరుగురు ముఖ్య ఉద్యోగులను ప్రత్యేకంగా ఓ చోట క్వారంటైన్ చేసినట్లు తెలిసింది. నేచర్ క్యూర్ ఆసుపత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం ఆయా ప్రముఖ ఛానల్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

    Previous Articleపదవి మూన్నాళ్ల ‘ముచ్చట’ చేసుకోకండి! జగన్ కు ‘ముద్రగడ’ ఘాటు లేఖ
    Next Article కరోనా దుష్ప్రచారంలో ‘ఖమ్మం కరోడాలు’!

    Related Posts

    సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ ఖరారు!

    November 1, 2023

    ‘తుమ్మల’ భూములపై భూతద్దం..!?

    September 1, 2023

    రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    July 13, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.