తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ‘దళిత బంధు’ పథకం అమలు, బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఈ పథకం కింద రూ. 80 వేల నుంచి లక్ష కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్​గా బండా శ్రీనివాస్​ను నియమించిన సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రగతి భవన్ కు వచ్చిన ఆయా నేతలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, కాళ్లు, చేతులు మాత్రమే ఆస్తులుగా బతుకుతున్న దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. హుజూరాబాద్​లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు పథకం కేవలం తెలంగాణలోనేగాక యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ పథకం ఎస్సీలందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Comments are closed.

Exit mobile version