Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»సిద్దిపేట సభలో సీఎం కేసీఆర్ కామెంట్స్..

    సిద్దిపేట సభలో సీఎం కేసీఆర్ కామెంట్స్..

    June 20, 20212 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 cm siddipet

    తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదివారం సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం దుద్దెడ శివారులో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టర్‌ భవనాన్ని, పోలీస్ కమిషనరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన ఏమన్నారో కేసీఆర్ మాటల్లోనే…

    • ప్రగతి ఫలాలు ప్రతి గడపకు అందాలనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం.
    • రాష్ట్రంలో నాలుగు వెటర్నరీ కళాశాలలు ఏర్పాటు చేస్తాం.
    • 1969లో సిద్దిపేట గడ్డమీద తెలంగాణ నినాదం మొదలైంది.
    • తాగునీటి కోసం ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
    • కనీసం అంత్యక్రియలకు నీళ్ళు ఉండేవి కావు.
    • గత ప్రభుత్వాల్లో నేల విడిచి సాము చేశారు.
    • నీళ్ళు, కరెంటు కోసం గోస పడ్డాం.
    • కాకతీయుల నాటి గొలుసు కుట్టు చెరువులు సమైక్య రాష్ట్రంలో ధ్వంసం చేశారు.
    • రాష్ట్రం ఏర్పాటుకు నాలుగు నెలల ముందుగానే స్వప్నించి మిషన్ కాకతీయ పేరు పెట్టాం.
    • దేశానికి ధాన్యాగారమైన పంజాబ్ ను అధిగమించాం.
    • తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల టన్నుల‌ ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు ఉండేవి…నేడు 25 లక్షలకు పెంచాం.
    • చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది.
    • తాగునీటికి, విద్యుత్ కు కొరత లేదు.
    • కొన్ని రాజకీయ పార్టీల నేతలకు సిగ్గు,శరం లేదు.
    • ఇప్పటి వరకు వ్యవసాయంపై సరైన లెక్కలు లేవు.
    • అధికారులకు నన్ను చూస్తూనే భయం పట్టుకుంది.
    • ప్రతి ఐదు వేల మందిని క్లష్టర్ గా రైతు వేదిక నిర్మించాం.
    • సిద్దిపేట చైతన్యానికి ప్రతీక.
    • నాటువేసే బదులు వెదజల్లుడు పద్దతి మంచిది.
    • వెదజల్లే పద్దతిలో సిద్దిపేట అగ్రగామి కావాలి.
    • గుజరాత్ లో పత్తి బాగా పండుతుంది కానీ, తెలంగాణ పత్తికి మంచి డిమాండ్ ఉంది.
    • రైతు కేంద్రంగా ప్రభుత్వం పని చేస్తుంది.
    • రైతు చల్లగా ఉంటే దేశం బాగుంటుంది.
    • రైతుకు సహాయం చేయాలనే ఆలోచన నుంచి వచ్చిందే రైతు బంధు.
    • రైతుకు ఇబ్బందులు లేకుండా చేయడమే రైతు రాజ్యం.
    • రాష్ట్రంలో భూ సమస్యలు ఎక్కువ… పరిష్కారం కోసం మూడేళ్ళు శ్రమించాం.
    • పహాణీలో 37 కాలమ్ లు తీసేసి మూడే కాలమ్ లు పెట్టాం.
    • ధరణిలో పేరు ఉందంటే నిశ్చింతంగా ఉండొచ్చు.
    • నకిలీ విత్తనాలు అమ్మితే ఉక్కుపాదం మోపుతాం.
    • రైతు చనిపోతే ఆకుటుంబానికి ధీమా రైతు భీమా పథకం.
    • పేద వర్గాలకు ఇంకా మంచి జరగాల్సి ఉంది.
    • కుల మతాలకు అతీతంగా సంక్షేమము జరుగుతుంది.
    • ఎన్టీఆర్ తీసుకు వచ్చిన రెండు రూపాయలు కిలో బియ్యం పథకం చాలా బాగా నచ్చింది.
    • ప్రజా ప్రతినిధులు మీద చాలా పెద్ద బాధ్యత ఉంది, నేల విడిచి సాము చేయవద్దు.
    • రాష్ట్రంలో 98.6 శాతం వైకుంఠ ధామాలు పూర్తి అయ్యాయి.
    • ఆక్సిజన్ కొనుక్కోవడం అంటే సమాజం సిగ్గు పడాలి.
    • గత ప్రభుత్వాలు నేల విడిచి సాము చేశాయి, పెద్ద పెద్ద డైలాగు లు చెప్పారు.
    • ఆకస్మిక తనిఖీ అంటే అధికారులు, సర్పంచ్ లను బద్నాం చేయడం నా ఉద్ధేశం కాదు.
    • చాలా మంది పిచ్చి కూతలు కూస్తున్నారు, అవేమి పట్టించుకోం.
    • భగీరధ చూడడానికి 11 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు.
    • కాళేశ్వరం కడితే కొన్ని కుక్కలు మొరిగాయి.
    • మల్లన్న సాగర్ అయిపోతే నెత్తి మీద కుండ ఉన్నట్లే.
    • నేను బయలు దేరిన నాడు తెలంగాణ వస్తుందని ఎవరు నమ్మలేదు.
    • 100 శాతం బంగారు తెలంగాణ అయి తీరుతుంది.
    • నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ప్రాజెక్ట్ పేరు దేవుడు పేరు పెట్టాం.
    • మిడ్ మానేరు నాసి రకం గా కట్టామని చిల్లర రాజకీయాలు చేశారు.
    • ఎందుకు పనికి రాని వాళ్ళు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు.
    • దేశంలో ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో కొన్నట్లు ధాన్యం కొనలేదు.
    • తెలంగాణకి సరి పోయే రైస్ మిల్లులు లేవు.
    • కొనుగోలు కేంద్రాలు దగ్గర రాజకీయ పార్టీలు ధర్నాలు కి ప్రయత్నం చేస్తే రైతులు తన్ని పంపారు.
    • దళిత వర్గం పేదరికం లో ఉంది, అసమానతలు పోవడం లేదు.
    • వాటిని పోగొట్టడానికి సీఎం దళిత ఎన్ఫోర్మేంట్ ప్రోగ్రాం కోసం బడ్జెట్ లో రూ. 1,000 కోట్లు కేటాయించాం.
    • ఇండియాలోనే నంబర్ వన్ ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ.
    • నేను పుట్టిన గడ్డ ఆదర్శ జిల్లా కావాలి.
    • సిద్దిపేట వర్ధిల్లాలి, తెలంగాణ వర్ధిల్లాలి.
    CM KCR cm siddipet tour kcr siddipet siddipet collectorate
    Previous Article‘మావోల వార్నింగ్’పై జంపన్న ఘాటు జవాబు
    Next Article వీడియోల వైరల్: సీఎం కాళ్లు మొక్కిన ఇద్దరు కలెక్టర్లు

    Related Posts

    సీఎం కేసీఆర్ ను కలిసిన ఎంపీ గాయత్రి రవి

    May 25, 2022

    తుమ్మల, పొంగులేటిలకు ‘షాక్’: సీఎం కేసీఆర్ ‘లెక్క’ కరెక్టేనా!?

    May 19, 2022

    కేసీఆర్ పై కేంద్రం కక్ష సాధింపు: మంత్రి అజయ్

    April 7, 2022

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.