Close Menu
    Facebook X (Twitter) YouTube
    Tuesday, November 28
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»సంచలనం! ప్రగతి భవన్ లో ‘భట్టి’…!!

    సంచలనం! ప్రగతి భవన్ లో ‘భట్టి’…!!

    June 25, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 bhatti

    తెలంగాణా రాజకీయాల్లో ఇదో సంచలన పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు నాయకులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. వీరిలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్ర, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబులు ఉండడం విశేషం. విపక్ష పార్టీకి చెందిన నాయకులకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ లభించడం సంచలనాత్మకంగా పలువురు అభివర్ణిస్తున్నారు.

    ఈమేరకు భట్టి విక్రమార్కతోపాటు ఆయా ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మరియమ్మ లాకప్ డెత్ అంశంపై వినతి పత్రం ఇవ్వడానికే భట్టితోపాటు ఆయా ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిసినట్లు చెబుతున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టాక విపక్ష పార్టీలకు ప్రగతి భవన్ లో లభించిన తొలి అపాయింట్మెంట్ గా ఈ ఘటనను భావిస్తున్నారు.

    bhatti vikramarka CM KCR pragathi bhavan telangana congress
    Previous Articleఖమ్మంలో ఉద్రిక్తత
    Next Article మరియమ్మ లాకప్ డెత్: సీఎం కేసీఆర్ సీరియస్… ఆదేశాలు

    Related Posts

    సీఎం కేసీఆర్ ను కలిసిన ఎంపీ గాయత్రి రవి

    May 25, 2022

    తుమ్మల, పొంగులేటిలకు ‘షాక్’: సీఎం కేసీఆర్ ‘లెక్క’ కరెక్టేనా!?

    May 19, 2022

    కేసీఆర్ పై కేంద్రం కక్ష సాధింపు: మంత్రి అజయ్

    April 7, 2022

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.