పోలీసులు ఘర్షణకు దిగి పరస్పరం కాల్చుకున్నారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఛత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేశ్లూర్ సమీపంలోని సెద్వాలో గల 241 సీఆర్పీఎఫ్ క్యాంపునకు చెందిన జవాన్లు శుక్రవారం ఘర్షణకు దిగారు. వివాదం ముదిరి తుపాకులు తీసి పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ ఉదంతంలో నారాయణఫూర్ కు చెందిన ఓ జవాన్ అక్కడిక్కడే మరణించాడు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడగా, మెరుగైన చికిత్స కోసం వారిని రాయపూర్ కు తరలిస్తున్నారు.
![ts29 crof](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2021/01/crof.jpg?resize=245%2C313&ssl=1)