జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సీఐ సాయి రమణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హన్మకొండలోని తన నివాసంలో సాయి రమణ పురుగుల మందు తాగి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రాణాపాయ స్థిలో గల సాయిరమణను చికిత్స కోసం హన్మకొండలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు.
![ts29 ci](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2021/02/ci.jpeg?resize=768%2C1024&ssl=1)
అయితే ఈ ఘటనకు ముందు సీఐ సాయిరమణ ఓ నోట్ కూడా రాసుకున్నారని, దాన్ని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఐ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇతమిద్ధంగా తెలియరాలేదు. ఈ ఘటనకు బుధవారం పాల్పడిన సీఐ సాయిరమణ ప్రస్తుతం సెలవులో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సీఐ ఆత్మహత్యాయత్నం సంఘటన వరంగల్ రేంజ్ పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలాన్ని కలిగించింది.