Facebook X (Twitter) YouTube
    Sunday, September 24
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»Crime News»‘కరీంనగర్ గ్రానైట్’పై సీబీఐ విచారణ

    ‘కరీంనగర్ గ్రానైట్’పై సీబీఐ విచారణ

    February 18, 20221 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 granite

    కరీంనగర్ నుంచి గ్రానైట్ అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతోందనే అంశంపై సీబీఐ రంగంలోకి దిగింది. ఈమేరకు విశాఖ సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. కరీంనగర్ గ్రానైట్ అక్రమ ఎగుమతులపై 2011 నుంచి కూడా విచారణ జరుగుతోంది. సీబీఐ, ఈడీ, కేంంద్ర సంస్థలు విచారణ జరుపుతున్న క్రమంలోనే గ్రానైట్ అక్రమ ఎగుమతి కొనసాగుతోందనే ఫిర్యాదుపై సీబీఐ రంగంలోకి దిగడం గమనార్హం.

    కరీంనగర్ కు చెందిన బీజేపీ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ విచారణ ప్రారంభించడం విశేషం. పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, గ్రానైట్ అక్రమ ఎగుమతులపై విచారణ జరుగుతోంది.

    కాకినాడ పోర్టు నుంచి కరీంనగర్ గ్రానైట్ అక్రమంగా విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి అక్రమ ఎగుమతులకు పాల్పడుతున్న గ్రానైట్ కంపెనీలకు రూ. 750 కోట్ల జరినామా విధించారు. ఈమేరకు పలు గ్రానైట్ సంస్థలకు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ గ్రానైట్ అక్రమ ఎగుమతి కొనసాగుతోందనే తాజా ఫిర్యాదుపై సీబీఐ విచారణ ప్రారంభించడం గమనార్హం.

    cbi probe granite transport issue karimnagar granite కరీంనగర్ గ్రానైట్ గ్రానైట్ అక్రమ ఎగుమతి సీబీఐ విచారణ
    Previous Articleమేడారానికి నేడు సీఎం కేసీఆర్
    Next Article మంత్రి హఠాన్మరణం

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.