ప్యాసింజర్ రైల్లో గేదె ప్రయాణించిన ఉదంతమిది. కోల్ కతా శివార్లలోని సీల్దా-డైమండ్ హార్బర్ మధ్య నడిచే స్థానిక ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న సందర్భంగా ప్రయాణీకులకు మాంచి వినోద దృశ్యం కనిపించడం విశేషం. తమతోపాటు ఓ గేదె కూడా ప్రయాణిస్తున్నట్లు గ్రహించిన ప్రయాణీకులు చాలా సేపు నవ్వుకున్నారు కూడా. అయితే రైలు బోగీలో గల ఈ గేదె ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకపోవడం విశేషం. సీల్దా-డైమండ్ హార్బర్ మధ్య నడిచే రైలు నెం. 34828లో గేదె ప్రయాణిస్తున్న చిత్రాన్ని బిస్వరూప్ ఘోష్ అనే ప్రయాణీకుడు తన సెల్ ఫోన్లో బంధించారు.

Comments are closed.

Exit mobile version