దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన విజయం సాధించారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో చివరికి విజయం రఘునందన్ రావునే వరించింది. మొత్తం 23 రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపులో 1,470 ఓట్ల అధిక్యంతో రఘునందన్ రావు గెలుపొందారు.
![ts29 dubbaka compressed](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/11/dubbaka-compressed.jpg?resize=788%2C490&ssl=1)