పది రోజులుగా కనిపించకుండాపోయిన పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆంధప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుట్ట మధును రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమవరంలోని పద్మాలయ థియేటర్ వద్ద గల లాడ్జిలో ఉండగా పుట్ట మధును రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి రామగుండం పోలీసులు ఓ ప్రకటనను అధికారిక వాట్సప్ గ్రూపులో విడుదల చేశారు. ఆయా ప్రకటనను ఉన్నది ఉన్నట్లుగానే దిగువన చదవవచ్చు.

రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో పుట్టమధు

గత వారం రోజులుగా అదృశ్యానికి గల కారణాలను ప్రశ్నిస్తున్న పోలీసులు

ఇప్పటికే ఒకసారి గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధును ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు

సదరు హత్య కేసుకు సంబంధించి గట్టు వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు ఇటీవల ఇచ్చిన మరొక ఫిర్యాదులోని అంశాలపై మరొకసారి పుట్ట మధును ప్రశ్నిస్తున్న పోలీసులు

రామగుండం పోలీసులు

Comments are closed.

Exit mobile version