Facebook X (Twitter) YouTube
    Sunday, September 24
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»Crime News»మహిళా ట్రైనీ ఎస్ఐ ఘటన: వరంగల్ సీపీ ప్రకటన

    మహిళా ట్రైనీ ఎస్ఐ ఘటన: వరంగల్ సీపీ ప్రకటన

    August 3, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 tarun joshi

    మహిళా ట్రైనీ ఎస్ఐ పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి స్పందించారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలో మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలు రుజువైతే ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

    మహబూబాబాద్ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు అధికారిని సదరు పోలీస్ స్టేషన్ ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళా ట్రైనీ ఎస్సై మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషికి ఫిర్యాదు కూడా చేశారు.

    ఈ ఫిర్యాదుపై వరంగల్ పోలీస్ కమిషనర్ తక్షణమే స్పందిస్తూ, జరిగిన సంఘటనపై వాస్తవాలు ఏమిటనేది విచారణ జరపనున్నట్లు చెప్పారు. మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా రుజువైతే ఎస్ఐ పి. శ్రీనివాస్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

    mahabubabad police maripeda SI warangal police
    Previous Article‘పునర్విభజన’పై కేంద్రం కీలక ప్రకటన
    Next Article కోడలితో ‘లింకు’… కొడుకును చంపిన కసాయి!

    Related Posts

    పోలీసు శాఖలో భారీ బదిలీలు

    March 4, 2022

    రేప్ కేసులో కార్పొరేటర్ భర్త అరెస్ట్

    October 1, 2021

    S/o లిక్కర్ డాన్.., వరంగల్ లో కలకలం!

    September 28, 2021

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.