మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్వకేట్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో బిట్టు శ్రీనును అరెస్ట్ చేసినట్లు డీసీపీ రవీందర్ వెల్లడించారు. వామన్ రావు దంపతులను హత్య చేసిన నిందితులకు బిట్టు శ్రీను ఆయుధాలను, వాహనాన్ని సమకూర్చినట్లు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీనును, కుమార్ ను, చిరంజీవిని నిన్ననే అరెస్ట్ చేశారు. నిందితులను పోలీసులు మంథని కోర్టులో హాజరుపర్చనున్నారు.

Comments are closed.

Exit mobile version