కరోనా మహమ్మారి తెలంగాణాలో ఓ అదనపు కలెక్టర్ ను బలి తీసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య (55) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. పది రోజుల క్రితం కరోనా బారిన పడిన అంజయ్యను ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్చారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న అంజయ్య చికిత్స పొందుతూనే మంగళవారం తుదిశ్వాస విడిచారు. అదనపు కలెక్టర్ అంజయ్య కరోనా బారిన పడి మరణించడతో సిరిసిల్లా జిల్లా అధికార వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments are closed.

Exit mobile version