కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామ శివారులో గల ఓ వ్యవసాయ బావిలోకి స్విఫ్ట్ కారు దూసుకెళ్లింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ మార్గంలో పయనిస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.
![ts29 car](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2021/07/car.jpg?resize=367%2C654&ssl=1)
బావిలో మునిగిన కారులో అయిదుగురు వ్యక్తులు ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బావిలో మునిగిన కారును పోలీసులు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.