తెలంగాణా అధికార పార్టీకి మరో ఎన్నికల విజయం దక్కింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 18,872 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కె. జానారెడ్డిపై నోముల భగత్ ఈ విజయం సాధించారు. కాంగ్రెస్‌కు 59, 239 ఓట్లు, బీజేపీకి 6,365 ఓట్లు పోల్ కాగా, బీజేపీ అభ్యర్థి తన డిపాజిట్ కోల్పోయారు.

Comments are closed.

Exit mobile version