తెలంగాణాలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి కూతురు పెళ్లి ఖర్చుల భారీ బిల్లులను ఓ ‘మిస్టరీ’ కంపెనీ చెల్లించిందనే వార్తా కథనం ఒకటి పెను సంచలనం కలిగిస్తోంది. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ హోదాలో నీటిపారుదల బాధ్యతలు చూస్తున్న రజత్ కుమార్ కూతురు పెళ్లి ఖర్చులను ఓ ‘మిస్టరీ’ కంపెనీ భరించినట్లు ‘ది న్యూస్ మినట్’ అనే వెబ్ సైట్ గురువారం పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది.

అత్యంత విలాసవంతమైన స్టార్ హోటళ్లలో రజత్ కుమార్ కూతురు పెళ్లికి సంబంధించిన వేడుకలు ఇటీవల జరిగాయని, ఇందుకు లక్షలాది రూపాయల బిల్లులను ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కంపెనీకి చెందినట్లు భావిస్తున్న ‘మిస్టరీ’ కంపెనీ చెల్లించిందనే సారాంశంతో ఈ కథనం ప్రచురితమంది. తెలంగాణాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న బడా కంపెనీకి చెందిన వ్యక్తులు కొందరు ఈ పెళ్లి ఏర్పాట్లు చేశారని ‘ది న్యూస్ మినట్’ వెబ్ సైట్ కథనం.

ఈ వార్తా కథనం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తన కుమార్తె పెళ్లికి ఆయా ఇంజనీరింగ్ కంపెనీ ఎటువంటి ఖర్చులు పెట్టుకోలేదని ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ చెబుతుండగా, తమ కంపెనీకి చెందిన ఉద్యోగులు వ్యక్తిగతంగా పెళ్లి ఏర్పాట్లు చేసి ఉంటారని, తమకు సంబంధం లేదని వివాదాన్ని ఎదుర్కుంటున్న బడా ఇంజనీరింగ్ కంపెనీ పేర్కొంంది.

తెలంగాణాలో జరిగిన గత అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సమయంలో రజత్ కుమార్ సీఈవోగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన వ్యవహార తీరుపై విమర్శలు కూడా వచ్చాయి. అనంతర పరిణామాల్లో రజత్ కుమార్ పలు ముఖ్య పోస్టుల్లో నియామకయ్యారు. ‘ది న్యూస్ మినట్’ ప్రచురించిన పరిశోధనాత్మక పూర్తి కథనాన్ని దిగువన గల లింక్ ద్వారా చదవవచ్చు.

https://www.thenewsminute.com/article/exclusive-top-telangana-bureaucrat-s-rajat-kumar-meil-daughter-s-wedding-gala-sponsored-mystery-company

Comments are closed.

Exit mobile version