మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు మండలం మర్రిమిట్ట సమీపంలో లారీ ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో గల ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్నవారు వివాహ శుభకార్యం కోసం కొత్త బట్టలు కొనుగోలు చేసేందుకు వరంగల్ వైపు ప్రయాణిస్తుండగా ఈ విషాద ఘటన జరిగింది.

మృతుల్లోని ముగ్గురు మహిళల్లో పెళ్లి కుమార్తె కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారు ఎర్రకుంట తండావాసులు కాగా, వారిని జాటోత్ రాము, ప్రమీల, కళ్యాణి, ప్రదీప్, ప్రసాద్, లక్ష్మిలుగా గుర్తించారు. ఇదిలా ఉండగా మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భాంతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Comments are closed.

Exit mobile version