తనను కలిసేందుకు వచ్చే పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు ఈనెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు ముందుగానే నిర్ధారించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని చెప్పారు. అందువల్ల దయచేసి తనను కలిసేందుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే రావాలని మనవి చేస్తున్నట్లు రేవంత్ చెప్పారు.

కాగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డిని, సంపత్ కుమార్ ను రేవంత్ రెడ్డి మార్యదపూర్వకంగా కలుసుకున్నారు. అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చిన్నయ్య తదితరులు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 7వ తేదీన పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు రేవంత్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Comments are closed.

Exit mobile version