దేశవ్యాప్తంగా ఎనిమిది మంది హైకోర్టు చీఫ్ జస్టిస్ ల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ ల నియామకానికి కూడా కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా సతీష్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రశాంత్ కుమార్ మిశ్రాల నియామకానికి కొలీజియం సిఫారసు చేసింది.

తెలంగాణాకు సిఫారసు చేసిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రస్తుతం కర్నాటక హైకోర్టు యాక్టింగ్ సీజేగా, ఆంధ్రప్రదేశ్ కు సిఫారసు చేసిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఛత్తీస్ గఢ్ సీజేగా ఉన్నారు. అదేవిధంగా 27 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

Comments are closed.

Exit mobile version