Facebook Twitter YouTube
    Monday, May 29
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»సుప్రీంకోర్టును ఆశ్రయించిన ‘నామ’ సోదరులు

    సుప్రీంకోర్టును ఆశ్రయించిన ‘నామ’ సోదరులు

    July 1, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 nama

    టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వర్ రావు సోదరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి తమకు రక్షణ కల్పించాలని అభ్యర్థిస్తూ ఎంపీ నామ నాగేశ్వర్ రావు సోదరులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. నామ నాగేశ్వర్ రావు సోదరులు దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ రొహిన్టన్ ఫాలీ నారిమన్, జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ బిఆర్ గవాయ్ లతో కూడి త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

    నామ నాగేశ్వర్ రావు, ఆయన సోదరుడు నామ సీతయ్యలపై ఎటువంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన బ్యాంకు రుణాలను దారి మళ్లించారనే అభియోగాలపై నామ నాగేశ్వర్ రావు, సీతయ్యలకు చెందిన నివాసాలపై, మధుకాన్ సంస్థల ఆఫీసులపై ఈడీ అధికారులు ఇటీవల దాడులు చేసిన సంగతి తెలిసిందే. గత నెల 25న తమ ముందు విచారణకు హాజరు కావాలని కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నామ నాగేశ్వర్ రావు సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    enforcement directorate madhucon projects nama nageshwar rao Supreme Court order
    Previous Articleకలకలం: ఖమ్మంలో మొండెం లేని తల
    Next Article మావోయిస్ట్ నేతకు ఎస్పీ నివాళి!

    Related Posts

    ఖమ్మం ఎంపీకి ‘స్వేచ్ఛ’

    March 1, 2023

    జర్నలిస్టుల కోసం ఎంపీ ‘నామ’ లేఖ

    February 28, 2023

    మేం యుద్ధం చేస్తున్నాం: ఎంపీ నామ

    April 7, 2022

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.