తెలంగాణా రాజకీయాల్లో ఇదో సరికొత్త పరిణామం. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఈటెల రాజేందర్ నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేశారు. సీఎం కేసీఆర్ సిఫారసు మేరకు ఈటెల రాజేందర్ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖను బదిలీ చేసిన నిర్ణయానికి గవర్నర్ ఆమోదం లభించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈటెల రాజేందర్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే, నివేదిక సమర్పణకు ముందే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

Comments are closed.

Exit mobile version