మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఆరు నెలల జైలు శిక్షకు గురయ్యారు. ఈ శిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం తీర్పు చెప్పింది. గత పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా డబ్బు పంపిణీ చేశారనే అభియోగంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో విచారణ అనంతరం ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు చెప్పింది. ఈమేరకు ఎంపీ కవిత రూ. 10 వేల జరిమానా చెల్లించగా, ఆమెకు బెయిల్ లభించింది.

Comments are closed.

Exit mobile version