ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ఓ ఐఏఎస్ అధికారి మోకాళ్లపై కూర్చున్న దృశ్యం వార్తాంశంగా మారింది. ఈ ఘటనపై ప్రసారమాధ్యమాల్లో భిన్న కథనాలుగా వస్తున్నాయి.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిన్న గణతంత్ర వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్ పిలవడంతో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి హోదాలో గల ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఇలా మోకాళ్లపై కూర్చుని మాట్లాడిన దృశ్యం వార్తల్లోకి వచ్చింది.

గతంలో తెలంగాణాలోని పలువురు ఐఏఎస్ అధికారులు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన ఘటనలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా కలెక్టరేట్ నూతన భవన సముదాయాల ప్రారంభోత్సవాల సందర్భంగా ఇద్దరు కలెక్టర్లు కేసీఆర్ కాళ్లు మొక్కిన ఉదంతాలు అప్పట్లో సంచలనాత్మక వార్తా కథనాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.

Comments are closed.

Exit mobile version