టీఆర్ఎస్ లో చేరిన హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ పొలిటికల్ గిఫ్ట్ ఇచ్చారు. నామినేటెడ్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించాలని ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈమేరకు గవర్నర్ ఆమోదాన్ని కోరుతూ కేబినెట్ సిఫారసు చేసినట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

Comments are closed.

Exit mobile version